జయహో కేసీఆర్…అభినందనల వెల్లువ

216
kcr cm
- Advertisement -

సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ని కలిసి అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో… మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీలు కాటేపెల్లి జనార్ధన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఉన్నారు. అలాగే టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, పీఆర్ టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి. శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు కలిసి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ , మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, గాంధీ, మాగంటి గోపీనాధ్, బేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, ముఠా గోపాల్, ప్రకాశ్ గౌడ్, జైపాల్ యాదవ్, మాధవరం కృష్ణారావు, వనమా వెంకటేశ్వర్ రావు తదితరులు అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్యేలు కె.మాణిక్ రావు, మెతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, గొంగిడి సునిత, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, గువ్వల బాలరాజు, పద్మా దేవేందర్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి త,మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, హరిప్రియా నాయక్, రేఖా నాయక్ తదితరులు సీఎంకు థ్యాంక్స్ చెప్పారు.

- Advertisement -