ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకోని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ బిల్వోవా ఉన్నం, తీర్ధ ఉన్నం రచించిన ఓజోన్ రన్ గ్రీన్ స్టెప్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదర్నగర్లోని ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్ జూనియర్ కాలేజీలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Also Read: మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులు
ఈ కార్యక్రమం ద్వారా చెత్తను వేరుచేయడం పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. పచ్చదనాన్ని పెంపొందించడానికి విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల క్యాంపస్లో ప్లాంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. గ్రీన్ స్టెప్స్ పుస్తకంలో పర్యావరణ అనుకూల దశల గురించి విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. యోగా, వర్టికల్ గార్డెనింగ్, నైబర్హుడ్ క్లీనప్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఆర్గానిక్ ఫెస్టివల్స్, ఓజోన్ రన్ వంటి ఆంశాలను కూడా పొందుపరిచారు. ఓజోన్ పొర క్షీణత పర్యావరణపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడం ఈ రన్ లక్ష్యమని సిబ్బంది తెలిపారు.
Also Read: పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్