మొక్కలు నాటిన ఎయిర్‌ టెల్ ఉద్యోగులు

40
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌ టెల్‌ ఉద్యోగులు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ స్థాపించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నానక్‌రాం గూడ టోల్ ప్లాజా వద్ద మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ…ఇంత గొప్ప అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ టెల్ హెచ్‌ ఆర్‌ &ఫెసిలిటీ మేనెజర్ బీ.సాహూ మరియు తదితర ఉద్యోగులు పాల్గోన్నారు.

Also Read: సెల్యూట్‌ టూ రావి నారాయణరెడ్డి

- Advertisement -