మనం పర్‌ఫెక్ట్‌ కాదు కానీ…!అనసూయ

37
- Advertisement -

ఎప్పుడూ సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటారు. తాజాగా మరోసారి ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఈ పాటికే అర్థమయి ఉంటుంది కదా..! జబర్దస్త్‌ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతుంది.

భర్తతో కలిసి బీచ్‌లో ఉన్న వీడియోను షేర్ చేస్తూ…డియర్ నిక్కు..2001లో నువ్వు నా కోసం రాసిన మొదటి ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నీకు రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు నీ పై నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇన్నేళ మన జీవితంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు కానీ వాటిని పట్టించుకోకుండా నాపై ఇంత ప్రేమను చూపుతున్నావు…మన వివాహ బంధాన్ని ఎంతో అద్భుతంగా నిలబెడుతున్నావు. ఇప్పటి వరకు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. నువ్వు నాపై చూపించే ప్రేమకు నీసహనానికి నేను కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతాను.

Also Read: భోళా శంకర్.. భోళా మ్యానియా రిలీజ్

మనమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాం. మనం పర్‌ఫెక్ట్ కపుల్‌ కాదని తెలుసు..అయినా కష్టసుఖాల్లో మనం కలిసి ఉన్నాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఒక్కటిగా ముందుకు సాగుతున్నాం. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు అంటూ తన భర్తపై ప్రేమను తెలిపింది.

Also Read: మహేష్ తో కాజల్ రొమాన్స్

- Advertisement -