Balagam: మరో అంతర్జాతీయ అవార్డు

66
- Advertisement -

వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం బలగం. కేవలం 1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పటివరకు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఈ సినిమాని నిర్మించింది. విమర్శకుల ప్రశంలను అందుకుంది.

తెలంగాణ స్లాంగ్ లో, తెలంగాణ ఊరిలో జరిగే కథగా ఈ సినిమా రావడంతో మంచి ఆదరణ వచ్చింది. ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డు వేడెక్కల్లో ఓ ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం సినిమా తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది.

యుక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం ఫెస్టివల్ లో బలగం సినిమా ‘బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం’ అవార్డు గెలుచుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం. బలగం సినిమా యుక్రెయిన్ ఒనికో ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిలిం అవార్డు అందుకుంది అని దర్శకుడు వేణు తెలిపారు.

- Advertisement -