హరిత తెలంగాణ పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓ బుక్ను విడుదల చేసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన తాజా పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 7,213 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పెరిగిన అడవుల శాతం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్ ర్యాంకులో నిలిచింది.
Also Read:ఇప్పుడు బాలయ్య వంతు.. గెట్ రెడీ!
దీంతో మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, హరితహారం విజయానికి ఇది మరో నిదర్శనం అని పేర్కొన్నారు.
తెలంగాణ పచ్చదనంలో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Great news for Telangana
On the eve of the world environmental day, the latest book released by Centre for Science and Environment (CSE) Telangana state stands a clear Number One among all indian states
Kudos to visionary leadership of CM KCR Garu and his brainchild… pic.twitter.com/02SSU6rvEm
— KTR (@KTRBRS) June 4, 2023