ఒకేసారి 20 మంది మంత్రులు రాజీనామా..!

33
Odisha
- Advertisement -

శనివారం ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ శ‌నివారం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. త‌న కేబినెట్‌లోని మంత్రులంద‌రినీ రాజీనామాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులందరూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. అదే స‌మ‌యంలో స్పీక‌ర్‌గా ఉన్న సూర్య‌నారాయ‌ణ పాత్రో కూడా ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు.న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న వారిని తొల‌గించి కొత్త వారితో కేబినెట్‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా స్పీక‌ర్ సూర్య‌నారాయ‌ణ పాత్రోకు త‌న కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ శాఖ‌ను అప్ప‌గించ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

రేపు కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం నిర్వ‌హించ‌నున్నారు. 2024 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో మంత్రులు పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్టారు. తాజా స‌మాచారం మేర‌కు 20 మంది మంత్రులు త‌మ రాజీనామాల‌ను ఒడిశా అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. ఇక రేపు ఉద‌యం 11.45 నిమిషాల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. ప్ర‌దీప్ అమ‌త్‌, ల‌తికా ప్ర‌దాన్‌ల‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -