అమెరికాలో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతోంది. సౌత్ కరోలినాలో ఇప్పటికే 4.9 చదరపు కి.మీ. మేర అటవీ భూమిలో కార్చిచ్చు వల్ల చెట్లు మసైపోయాయి.
కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని అధికారులు తెలిపారు. 175 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. నార్త్ కరోలినాలో 4 ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల 400 ఎకరాల అటవీ భూమి కాలిపోయింది. నార్త్ కరోలినాలోని పోల్క్ కౌంటీలో ప్రజల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది నార్త్ కరోలినాలోని అషేవిల్లెకు ఆగ్నేయంగా 40 మైళ్ల దూరంలో దాదాపు 600 ఎకరాల భూమిని నాశనం చేసిన కార్చిచ్చును ఆపడానికి దానిచుట్టు కంటైన్మెంట్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read:నిర్మాత కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు!

