- Advertisement -
రైల్వేకు సంబంధించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నవరత్న హోదా ఇచ్చింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వేఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నవరత్న హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
నవరత్న హోదా కలిగిన 25వ కంపెనీగా ఐఆర్ సీటీసీ, 26వ కంపెనీగా ఐఆర్ఎఫ్సీకి గుర్తింపు ఇచ్చింది. ఐఆర్ సీటీసీ రూ.4270.18 కోట్ల వార్షిక టర్నోవర్, ఐఆర్ఎఫ్సీ రూ.26,644కోట్లుగా ఉంది.
Also Read:కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ
- Advertisement -

