‘ఆదిపురుష్’ ఫస్ట్ షో కాస్ట్లీ గురూ

22
- Advertisement -

ప్ర‌భాస్ హీరోగా వ‌స్తోన్న తాజా చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణ క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంద‌రికీ భారీగా అంచ‌నాలున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో ఆదిపురుష్ సినిమా ఉద‌యం 4 గంట‌ల‌కే ప‌డ‌నుంది. తెలంగాణ‌లోని సుమారు 50 సెంట‌ర్ల‌లో తెల్ల‌వారుఝామున షోలు ఉండ‌నున్నాయి. ఇక ఈ షోలలో ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో టికెట్ రేట్లు ఆకాశానంటాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఒక టికెట్ ధర రూ. 2వేలు దాటింది. మొదటి రోజు షోకు రూ.2వేలు, రెండో రోజు షోకు రూ.1800 చూపిస్తున్నట్టు సమాచారం. ముంబైలోని కొన్ని మాల్స్‌లో రూ. 2వేల నుంచి మొదలై.. రూ, 1700, రూ. 1500 ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో బెంగళూరు, కోల్‌కతాలో ఉన్నాయి. దీంతో ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ రాబోతున్నాయి.

Also Read: అవంతికకు గుర్తింపు రాలేదట..!

ఇప్పటికే తెలంగాణలో ఆదిపురుష్‌ అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి బుక్ మై షో నుంచి సమాచారం అందుతుంది. రాష్ట్రంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని.. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదు అని చెబుతుంది. మొత్తానికి ప్రభాస్ స్టార్ డమ్ ఏమిటో ఈ సినిమాతో మరోసారి రుజువు అయింది.

Also Read: ‘పుష్ప‌ 2’ లో న‌టించ‌ట్లేదట

- Advertisement -