అవంతికకు గుర్తింపు రాలేదట..!

57
- Advertisement -

తెలుగు సినిమాను ప్రపంచంకు పరిచయం చేసిన సినిమా బహుబలి. ఈ సినిమాలో నటించిన వారందరూ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. అయితే తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బహుబలి లాంటి సినిమా వల్ల ఎక్కువ గుర్తింపు వస్తుందన్నది నా అభిప్రాయం. అందుకే ఈ సినిమాలో రానా ప్రభాస్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాలో నటించిన అనుష్క రమ్యకృష్ణకు కూడా పేరు తెచ్చిపెట్టింది. కానీ నా పాత్ర మాత్రం అతిథి పాత్రగానే ఉండిపోయింది. అందుకే తగిన గుర్తింపు రాలేదని అన్నారు.

Also Read: భగవంత్ కేసరిలో శ్రీలల..

రానా ప్రభాస్ ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు వాళ్లు ప్రశంసలకు అర్హులు అని తెలిపింది. బహుబలి సక్సెస్‌ను తాను క్యాష్ చేసుకోలేకపోయినట్టు తెలిపింది. పాత్ర చిన్నదైన చాలా కీలకమైందని…అది ప్రేక్షకులకు ఎంతో నచ్చిందని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తమన్నా చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే రజనీకాంత్‌తో జైలర్‌లో కనిపించనుంది. హిందీలలో బోల్‌ చుడీయా మలయాళంలో బాంద్రా సినిమాలు చేస్తున్నారు.

Also Read: బన్నీతో శ్రీలీల చేస్తోంది ఏమిటి ?

- Advertisement -