మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్, మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీలకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు చెందిన ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని పలు ఆస్తులపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా రాంపూర్, సహారన్పూర్ మరియు ఢిల్లీలోని దాదాపు 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ సోదాలు చేపట్టింది.
ప్రభుత్వ కాంట్రాక్ట్ నిధులను ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా మళ్లించడం, ఆపై ఆ నిధులను విశ్వవిద్యాలయం మరియు దానికి సంబంధించిన ట్రస్ట్ ఆస్తుల నిర్మాణంతో సహా ఇతర అవసరాలకు ఉపయోగించారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది.
కొందరు కాంట్రాక్టర్లు మరియు ట్రస్ట్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు అధికారులు గురింంచారు. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా ప్రయోజనం పొందిన కాంట్రాక్టర్లు విరాళాల రూపంలో, అలాగే నిర్మాణ పనుల చెల్లింపుల రూపంలో నిధులను విశ్వవిద్యాలయం మరియు ట్రస్ట్కు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ నిధుల మళ్లింపు, వినియోగానికి సంబంధించిన ఆర్థిక రికార్డులు, పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించడంతో పాటు, నేరపూరిత రాబడిని గుర్తించేందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.యూనివర్సిటీ నిర్మాణంలో జరిగిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఈడీ తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది.దర్యాప్తు క్రమంలో ఆజం ఖాన్పై గతంలో నమోదైన పలు కేసుల వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక పత్రాలు, ఇతర ఆధారాలను ఏజెన్సీ పరిశీలిస్తోంది.
గత నెలలో, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్కు చెందిన మహమ్మద్ అలీ జౌహర్ విశ్వవిద్యాలయంలోని 38 భవనాలను కూల్చివేయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ (RDA) ఉత్తర్వులు జారీ చేసింది. ఆమోదించబడిన భవన ప్లాన్లు (బిల్డింగ్ ప్లాన్స్) లేకుండానే ఆ నిర్మాణాలను చేపట్టినట్లు ఆరోపించింది.
Also Read:ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం..సుప్రీం నో!
ఇటీవల లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా, భద్రతా నిబంధనల అమలుపై ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థలను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగింది.
రాష్ట్రవ్యాప్త ఆడిట్లో భాగంగా అగ్నిమాపక శాఖ మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీని తనిఖీ చేసింది. తనిఖీ సమయంలో క్యాంపస్లోని 38 నిర్మాణాలకు సంబంధించి ఆమోదించబడిన భవన ప్లాన్లను విశ్వవిద్యాలయం చూపించలేకపోయిందని అధికారులు తెలిపారు.

