రామ్ మందిర్ విరాళాల దొంగతనం ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో, సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేత విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయాన్ని కోర్టు సెలవుల తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు వచ్చిన విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు పరిశీలించింది. అయితే, ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ-సిట్ దర్యాప్తు జరగాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు సెలవుల తర్వాత రెగ్యులర్ బెంచ్ ముందుకు తీసుకురావాలని ఆదేశించింది.
ఈ కేసును త్వరితగతిన విచారించాలన్న అభ్యర్థనను విన్న సర్వోన్నత న్యాయస్థానం…ఈ దశలో తక్షణ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ విషయంలో అత్యవసర విచారణ అవసరం లేదు అని కోర్టు పేర్కొంది. కోర్టు సెలవుల ముగిసిన తర్వాత ఈ పిటిషన్ను రెగ్యులర్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
Also Read:GIC:తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయం
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు వచ్చిన విరాళాల నిర్వహణలో ఆర్థిక అక్రమాలు జరిగాయని ఈ పిటిషన్లో ఆరోపించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు. ఆరోపణలపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేయడానికి సీబీఐ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.

