- Advertisement -
తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. ఇకపై వాట్సాప్, SMS, ఈ-మెయిల్ ద్వారానే నేరుగా మొబైల్స్కు రానున్న ట్రాఫిక్ చలానాలు రానున్నాయి. వాహనదారులందరూ రాబోయే ఒక నెల రోజుల్లోగా తమ యాక్టివ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని వాహన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.
నెల రోజుల గడువు ముగిశాక.. పోర్టల్లో ఉన్న నంబర్కు వాట్సాప్ లేదా SMS ద్వారా చలానా పంపిస్తే..అది వాహనదారుడికి అందినట్లుగానే భావిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర రవాణా శాఖ నిబంధనల సవరణల మేరకు తెలంగాణలో ఈ సరికొత్త డిజిటల్ చలానా విధానాన్ని తక్షణమే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రవాణా శాఖ.
Also Read:టాలీవుడ్పై జాన్వీ ఇంట్రెస్టింగ్!
- Advertisement -

