నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసు దర్యాప్తు తీవ్రతరమవడంతో బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో లాతూర్కు చెందిన ఒక వైద్యుడు, పుణెలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ ఫ్యాకల్టీ టీచర్ ఉన్నారు.ఈ తాజా అరెస్టులతో పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి మొత్తం సంఖ్య 13కు చేరింది.
రేణుకాయ్ కెరీర్ సెంటర్ (RCC) వ్యవస్థాపకుడు శివరాజ్ మోతేగాంకర్ కుమారుడితో సహా ముగ్గురు విద్యార్థులకు, నిందితుడైన పి.వి. కుల్కర్ణి నుండి కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ప్రశ్నలను అందించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరేను సీబీఐ అరెస్ట్ చేసింది.
అలాగే పుణెలోని డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ (APMA) అనే కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న తేజస్ హర్షద్కుమార్ షాను కూడా దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీషా హవల్దార్ అనే నిందితురాలి నుండి షా నీట్-యూజీ 2026 లీకైన ఫిజిక్స్ ప్రశ్నలను అందుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులోని కుట్రను…దీని వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ ఇప్పటివరకు 49 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువులపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది అని సీబీఐ ప్రతినిధి తెలిపారు.
Also Read:విజయన్కు షాక్..ఈడీ రైడ్స్!

