క్రిస్మస్‌ కానుకగా మేరీ క్రిస్టమస్ పోస్టర్‌

88
- Advertisement -

టాలీవుడ్‌ మల్లీశ్వరీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆగ్రహీరోలతో నటించిన కత్రినా…తాజాగా తమిళ విలక్షణ నటుడు విజయ్‌సేతుపతితో కలిసి మేరీ క్రిస్టమస్ సినిమా చేయనున్నారు. అయితే క్రిస్మస్ సందర్భంగా చిత్ర బృందం మేరీ క్రిస్టమస్ తొలి పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. పోస్టర్‌లో రెండు చేతులు వైన్‌గ్లాసులను పట్టుకుని వాటిని ఒకదానికొకటి చిర్రెత్తి పగుల కోట్టినట్టు కనిపించే పోస్టర్‌ను విడుదల చేసింది.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా…తమిళం హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం విజయ్ విడుతలై, షారూఖ్‌ఖాన్‌తో జవాన్, మరియు షాహిద్‌ కపూర్‌తో ప్రైమ్‌ వీడియో సిరీస్‌లో ఫర్జీలో నటిస్తున్నారు. కత్రినా కూడా వచ్చే యేడాది దీపావళి కానుకగా విడుదల కానున్న టైగర్ 3లో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి…

చివరి కోరిక తీరకుండానే నింగికేగాడు !

షాకింగ్‌… సినిమాలకు అనుపమ గుడ్‌ బై

అరెరే.. ఆ పాన్ ఇండియా క్రేజ్ ఏమైంది ?

- Advertisement -