దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా తీవ్రత..

149
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. 9 లక్షలకు దిగువకు చేరాయి యాక్టీవ్ కేసుల సంఖ్య. టీకాలు తీసుకున్న వారి సంఖ్య 26 కోట్లు దాటగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,224 కరోన పాజిటివ్ కేసులు నమోదుకాగా 2542 మంది మృతి చెందారు.

నిన్న ఒక్కరోజే కోలుకున్న 1,07,628 మంది బాధితులు కోలుకోగా దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,96,33,105 కి చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 8,65,432 మందికి చికిత్స కొనసాగుతుండగా కరోనా నుండి 2,83,88,100 మంది బాధితులు కోలుకున్నారు.

కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,79,573 మంది మృతి చెందగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.80%, మరణాల రేటు 1.28%కు చేరాయి.
ఇప్పటివరకు 26,19,72,014 మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -