దేశంలో 24 గంటల్లో 546 మంది మృతి..

130
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 39,097 కరోనా కేసులు నమోదుకాగా 546 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరగా 3,05,03,166 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,20,016 మంది బాధితులు మృతిచెందగా దేశంలో ప్రస్తుతం 4,08,977 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్పటివరకు 42,78,82,261 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 1.31గా ఉండగా పాజిటివిటీ రేటు 2.22 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 45.45 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -