కేటీఆర్ బర్త్ డే…మొక్కలు నాటిన స్పీకర్

185
speaker
- Advertisement -

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. శాసనసభ ఆవరణలో మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీక‌ర్ పోచారం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆరోగ్యమే మహాభాగ్యం…. ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన త్రాగునీరు, సేంద్రియంగా పండించిన సహజ ఆహారం అవసరం. ఈ మూడు రకాల అవసరాలను ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. సహజమైన సేంద్రియ ఆహార ధాన్యాలు సాగుచేయడానికి ప్రోత్సహిస్తున్నారు అని పోచారం వెల్లడించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేశ్‌, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్ రావు, భానుప్ర‌సాద్ రావు, కూచికుళ్ల దామోద‌ర్ రెడ్డి, వాణీదేవీ, బుగ్గారం దయానంద్, ఫారుక్ హుస్సేన్, విజీ గౌడ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్ట‌ర్ వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.

- Advertisement -