దేశంలో 25 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు…

194
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా రోజురోజుకు విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,46,786 కరోనా కేసులు నమోదుకాగా 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,66,10,481కు చేరగా ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనాతో ఇప్పటి వరకు 1,38,67,997 మంది కోలుకోగా 1,89,544 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 13,83,79,832 డోసులు వేయగా 27.61 లక్షల నమూనాలను పరిశీలించినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -