వైద్య,ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

154
kcr cm
- Advertisement -

వైద్య ఆరోగ్య శాఖ కు ముఖ్య మంత్రి కెసిఆర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్ గా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

వేసవి కాలం కావడం అన్ని ఆసుపత్రిలో కరోనా పేషంట్లు నిండి ఉన్న నేపధ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి అని ఆదేశించారు.గాంధీ, టిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువ యు న్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశించారు.యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్ ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

కరోనా వ్యాప్తి పెరిగిన నేపధ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరగడం తో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా దేశంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా మన రాష్ట్రానికి అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కి లేఖ రాయనున్నారు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.

కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్ష తో సంబంధం లేకుండా చికిత్స ప్రారంభించాలని ఆదేశాలు జారీ.లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐశోలేషన్ కిట్స్ అందించాలని ఆదేశించారు.ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మొనిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్ని లక్షల మందికి అయిన హోమ్ ఐశోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ ను సమకూర్చాలని సీఎం కెసిఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందించాలని మంత్రి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -