దేశంలో 24 గంటల్లో 30,570 కరోనా కేసులు

132
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 30,570 కరోనా కేసులు నమోదుకాగా 431 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరగా 3,25,60,474 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3,42,923 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటివరకు 4,43,928 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో అత్యధికం కేరళలోనే ఉన్నాయని వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 64,51,423 మంది వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా ఇప్పటివరకు 76,57,17,137 కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -