బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 11 హైలైట్స్

123
bb5
- Advertisement -

బుల్లితెర రియల్టీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 11 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 11వ ఎపిసోడ్లో భాగంగా కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య దూరాన్ని మరింత పెంచేసింది. ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు కొట్లాడుకునే వరకు పరిస్థితి వెళ్లింది. తొలుత సన్నీ, ప్రియల మధ్య గొడవ మొదలైంది. సన్నీని హెచ్చరిస్తూ నోరు మూసుకో అనడంతో నోరు మూసుకో అనడం తప్పు ప్రియా గారు అని సన్నీ తెలపగా షట్ అప్ అని కూడా అంటాను అని ప్రియ మరింత రెచ్చగొట్టగా మాటలయుద్దం అలాగే కొనసాగింది.

తర్వాత సాగరా సోదరా అనే కాళ్లు చాపి కొలతల కొలిచే టాస్క్ ఆడారు. ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాలకుడిగా ఉండగా.. బ్లూ టీం తరుపున శ్రీరామ్ సంచాలకుడిగా ఉన్నాడు. అయితే ఈ పోటీలో ఎల్లో టీం 33.3 మీటర్స్‌.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. అయితే ఎల్లో టీం లో ఉన్న శ్వేత చివరి క్షణంలో కిందకి పడటంతో రచ్చ రేగింది.

అయితే గేమ్ కాకుండానే ఆమె కిందపడిపోయిందని బిగ్ బాస్‌కి కంప్లైంట్ చేశాడు శ్రీరామ్. ఇందులో విజేతలు ఎవరో చెప్పకపోతే టాస్క్‌ని రద్దు చేస్తాం అని చెప్పిన బిగ్ బాస్ అన్నట్లుగానే ఆటను రద్దుచేశారు. టాస్క్ రద్దు చేశారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి కానీ.. ఇలా డాన్స్‌లు వేయడం కాదు అని చురకలేశాడు రవి.. సిగ్గు మీకు మాకు అవసరం లేదు అని ప్రియ కౌంటర్ ఇచ్చింది.

తర్వాత రవి- శ్రీరామ్‌ ఒకరినొకరు మాటల యుద్దంతో రెచ్చిపోయారు. నీ గేమ్ నువ్ ఆడు.. నాతో మైండ్ గేమ్ ఆడకు. నేను ఇక్కడికి రూ.50 లక్షల కోసం రాలేదు.. అవి వాళ్ల ముఖంపై కొట్టేసి వెళ్తా అని రవి ముందు కుండబద్దలు కొట్టేశాడు శ్రీరామ్. తర్వాత మానస్‌ – శ్రీరామ్ మధ్య కూడా మాటలయుద్దం జరిగింది.

హౌస్‌లో తనకి సాధ్యమైనంతగా ఆడుతున్నానని అయితే తనకు ఏమైనా అయితే తన ఫ్యామిలీకి వెనుక ఎవరూ లేరని మానస్, శ్రీరామ్‌ల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు లోబో. ఇక తర్వాత టాస్క్‌లో భాగంగా ఒకరిపై ఒకరు ఎక్కేసి ఆడ మగా తేడా లేకుండా విచక్షణ మరిచి శారీరక హింసకు పాల్పడ్డారు కంటెస్టెంట్లు. శ్రీరామ్-సన్నీలు పీకా పీకా పట్టుకుని కొట్టుకున్నారు. ఉమాదేవి చేతికి అందిన వాళ్లని కొట్టిపడేసింది.ఈ క్రమంలో ఉమ-ఆనీ మాస్టర్‌ల మధ్య పెద్దగొడవే జరిగింది. ఒకర్నొకరు తూ.. తూ అని దుమ్మెత్తి పోసుకున్నారు.

- Advertisement -