దేశంలో 24 గంటల్లో 18,815 కరోనా కేసులు…

57
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 18,815 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,35,85,554కు చేరగా 4,29,37,876 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,335 యాక్టివ్ కేసులుండగా 5,25,343 మంది మృతిచెందారు.

రోజువారీ పాటివిటీ రేటు 4.96 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. మరణాలు 1.21 శాతంగా ఉండగా దేశవ్యాప్తంగా 198.51 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -