సాయి పల్లవికి షాక్‌!

76
sai pallavi
- Advertisement -

హీరోయిన్ సాయి పల్లవికి షాక్ తగిలింది. ఇటీవల వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాని, గోరక్షకులను గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదం కాగా వాటికి తర్వాత సమాధానం కూడా చెప్పింది.

ఈ నేపథ్యంలో ఓ భజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్త ఫిర్యాదుతో హైదరాబాద్ సుల్తాన్‌ బజార్‌ పోలీస్ స్టేషన్ లో కూడా సాయిపల్లవి పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సాయిపల్లవికి జూన్‌ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కానీ సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసులు జారీ చేసిన నోటీసులపై ఆమె స్పందించాల్సిందేనని న్యాయస్థానం తెలిపింది.

- Advertisement -