Sharmila:ప్రధానిగా రాహుల్..అదే వైఎస్ కల

26
- Advertisement -

రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అన్నారు వైఎస్ షర్మిల. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరారు. అనంతరం మాట్లాడిన షర్మిల.. చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని…వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఏ పదవి ఇచ్చినా నమ్మకంగా పనిచేస్తానని …రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందన్నారు. క్రిస్మస్‌ విషెస్‌ చెబుతూ లోకేశ్‌ చేసిన ట్వీట్‌ను రాజకీయంగా చూడవద్దని ఆమె కోరారు. చంద్రబాబుకు మాత్రమే కాదు కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత.. ఇలా చాలామందికి కేక్‌ పంపించానని తెలిపారు.

రాజారెడ్డి వివాహానికి చాలామందిని ఆహ్వానిస్తున్నామని.. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడా ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. చంద్రబాబు తెలుగు దేశం పార్టీకి నాయకుడు.. తాను కాంగ్రెస్‌లో కార్యకర్తను అని షర్మిల చెప్పారు.

Also Read:తులసి గింజలతో ఎన్ని లాభాలో..!

- Advertisement -