ఒవైసీ విమర్శలకు యోగి గట్టి కౌంటర్..!

248
CM Yogi
- Advertisement -

అపరాధులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇటీవల యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లను తప్పుపడుతూ ఎంఐఎం అధినేత,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన విమర్శలకు సీఎం యోగి గట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసినవాడు అపరాధేనని… వారికి ఏ మతమూ ఉండదని సీఎం యోగి చెప్పారు. అపరాధులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు.

గత నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక మార్పులను తీసుకొచ్చామని యోగి తెలిపారు. 2017లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు కొందరికి ఓటు హక్కు కూడా లేదని, రోడ్లు లేవని, పాఠశాలల్లో మౌలికవసతులు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో పరిస్థితిని మార్చామని తెలిపారు. గతంలో ఆరోగ్యశాఖలో ఎలాంటి సదుపాయాలు లేవని… ఇప్పుడు పరిస్థితి మారిందని, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితిని తీసుకొచ్చామని చెప్పారు.

- Advertisement -