దేశం గర్వపడేలా తెలంగాణ బడ్జెట్: మంత్రి తలసాని

241
minister talasani
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉంది అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. శుక్రవారం మంత్రి తలసాని,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత టీఆర్ఎస్ ఎల్పి కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉంది. అభివృద్ధి ,సంక్షేమం సమ పాళ్ళలో ఉందన్నారు. వ్యవసాయం,అనుబంధ విభాగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట లభించింది. పాడిపరిశ్రమ మీద 12 లక్షల కుటుంబాలు ఆధార పడి ఉన్నాయి…పాడి పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు.

ఒకపుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇపుడు 60 కోట్ల రూపాయల లాభంలో ఉందంటే అది సీఎం కేసీఆర్ విధానాల ఫలితమే. వివిధ డైరీల టర్న్ ఓవర్ 600 కోట్ల రూపాయలకు చేరింది. పాడి రైతులకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాన్ని 39 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాం.లీటర్ కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రకటించిన దాంట్లో ఒక్క రూపాయి చొప్పున భరించేందుకు డైరీలు ముందుకు రావడం అభినందనీయం అన్నారు..డైరీల్లో 2 లక్షల 15 వేల మంది సభ్యులు ఉన్నారు. వారందరీ సంక్షేమమే మా ప్రాధాన్యం..విజయ డైరీ ప్రైవేట్ కంపెనీలతో పొటీ పడేలా మార్కెటింగ్ సదుపాయాలు పెంచుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

కొత్త ఐస్ క్రీం ఉత్పత్తులు విజయ బ్రాండ్ పేరిట విడుదల చేశాం. విజయ ఔట్ లెట్ల సంఖ్యను వెయ్యికి పెంచుతున్నామన్నారు.అలాగే గొర్రెల పంపీణీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాము. బర్రెలను సబ్సిడీ రేట్లపై పంపిణీ చేసేందుకు ప్రాధాన్యత నిస్తున్నామని.. గ్రామీణాభివృద్ధికి ,కుల వృత్తులకు చేయూత నిచ్చేందుకు చారిత్రాత్మక బడ్జెట్ అవకాశం కల్పించిందన్నారు. కళ్లుండి చూడలేని విపక్షాలు బడ్జెట్‌ను విమర్శిస్తున్నాయి.కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తున్నా కొందరికి కనిపించడం లేదు. విజయ ఔట్ లెట్లతో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే పాడి,పశు సంవర్ధక శాఖలకు పునరుత్తేజం వచ్చిందన్నారు మంత్రి తలసాని.

రాష్ట్రంలో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తాం. గొర్రెల పంపిణీలో అవక తవకలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం. గొర్రెల పెంపకం దారులకు గడ్డి విత్తనాలు ఉచితంగా అందిస్తున్నాం. నాణ్యమైన చేపలను మా శాఖ నుంచి అందించేందుకు 150 సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ గెలవబోతుంది అని మంత్రి తలసాని అన్నారు.ప్రభుత్వ పని తీరుకు ప్రజల ఆదరణ లభిస్తోంది. విద్యావంతులు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా నమోదు కావడం విచారకరమన్నారు.

ఉద్యోగాల భర్తీపై ప్రతి పక్షాలు గాలి కబుర్లు చెబుతున్నాయి.తాము అధికారంలో ఉండగా ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవ చేశారు. పాడి పరిశ్రమ మూత పడే స్థాయి నుంచి లాభాల బాటకు వెళ్లిందంటే అది సీఎం కేసీఆర్ విధానాల ఫలితమే.ఇక రాష్ట్రంలో యాదాద్రి పుణ్య క్షేత్రం ప్రపంచం ఆశ్చర్యపడేలా రూపుదిద్దుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -