ప్రధాని మోదీపై‌ ప్రియాంక గాంధీ సెటైర్..

185
- Advertisement -

ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మహిళల వస్త్రాదరణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. దీంతో మహిళాలోకం తీరత్‌పై మండిపడుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వ్యంగంగా విమర్శించారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో మోకాళ్లకు పైగా ఖాకీ నిక్కర్లను ధరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘ఓ మై గాడ్… వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి’ అని కామెంట్ చేశారు. కొంత కాలం క్రితం వరకు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ యూనిఫామ్‌లో భాగంగా తెల్లటి చొక్కా, ఖాకీ నిక్కరు ధరించేవారు. ఇటీవలే నిక్కరు స్థానంలో ప్యాంటు వేసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.

- Advertisement -