యోగా డే.. ఆసనాలు వేసిన ప్రధాని మోదీ..

50
- Advertisement -

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా మైసూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని తెలిపారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందన్నారు.

కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్న మోదీ.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -