హనీమూన్ ట్రిప్‌లో నయన్‌-విఘ్నేశ్ జంట..

33
Nayanthara-Vignesh
- Advertisement -

ఇటీవల సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వివాహం జరిగిన విషయం తెలసిందే. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఏడేళ్ల పాటు ప్రేమించుకొని మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

అయితే ఈ జంట హనీమూన్‌కు ఎక్కడికి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ జోడీ థాయ్ లాండ్‌ను తమ హనీమూన్ వేదికగా ఎంచుకుంది. నయనతారతో తన భావోద్వేగాలను పంచుకుంటున్న ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీరిద్దరూ ఇక్కడి సముద్ర తీరప్రాంతంలోని ఓ విలాసవంతమైన విల్లాలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. నా స్వీట్ హార్ట్‌తో థాయ్ లాండ్‌లో అంటూ విఘ్నేశ్ శివన్ తన పోస్టులో కామెంట్‌ రాశాడు.

- Advertisement -