బాలీవుడ్ హీరో రణ్సింగ్ నటించిన ధురంధర్ గత శుక్రవారం విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం మార్చి 19, 2026న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఇదే తేదీకి యాష్ నటిస్తున్న KGF తర్వాత అతని అత్యంత భారీ ప్రాజెక్ట్ టాక్సిక్ కూడా ప్లాన్ అవ్వడం వల్ల వెంటనే వాయిదా వార్తలు మొదలయ్యాయి.
ఈ రూమర్లకు పూర్తిగా తెరదించేందుకు, టాక్సిక్ టీమ్ 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అని తెలిపే అధికారిక పోస్టర్ను రిలీజ్ చేసింది. దీని ద్వారా చిత్రం మార్చి 19, 2026నే థియేటర్లకు రానుందని స్పష్టంగా తెలిపింది. దర్శకురాలు గీతూ మోహన్దాస్, యాష్ మరియు మొత్తం టీమ్ ఈ తేదీకి ఎలాంటి మార్పు లేదని ఖరారు చేశారు.
ఈ నిర్ధారణతో, ధురంధర్ 2 vs టాక్సిక్ బాక్సాఫీస్ పోరు జరగనుంది. టాక్సిక్ చిత్రంలో రుక్మిణి వసంత్, కియారా ఆడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Also Read:అమెరికా పర్యటనలో లోకేష్ బిజీ బిజీ..

