మా ఊరి యాదవుల ఓట్లు టీఆర్ఎస్ కే..

342
Trs Party
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారు ప్రజలు. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎంపీటీసీ , జెడ్పీటీసీ అభ్యర్ధులను కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎమిరెడ్డిపల్లి గ్రామంలో యాదవులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులకే వేస్తామని తీర్మానం చేశారు.

అంతేకాకుండా వారి ఇంటి ముందు గోడలపై మా ఊరి యాదవుల ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకి తప్ప ఇతర పార్టీలకు వేయము.. దయచేసి ఇతర పార్టీలు యాదవుల ఇళ్లలో ఓట్లు అడగరాదు’ అంటూ పోస్టర్లను అంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు ఎన్నో అభివృద్ది పథకాలు అమలు చేశారన్నారు. యాదవులకు గొర్లు ఇచ్చి ధనికులుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

- Advertisement -