నేటి నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

29
- Advertisement -

నేటి నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానుండగా అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు.

11 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 27న స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం జరుగనుండగా 28న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగనుంది. ఇక మార్చి 1న శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవం, 3న సాయంత్రం శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవముతో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -