సెమీస్ చేరిన భారత్..

18
- Advertisement -

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు సెమీస్‌కు చేరింది. కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. భారత్ విధించిన 156 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి 54 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు అంపైర్లు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన రాణించడంతో భారత్ 150 పరుగులు చేసింది. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 87 పరుగులు చేసింది. యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 24(29 బంతులు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13(20 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ 19(12 బంతుల్లో) పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -