- Advertisement -
ఆసియా క్రిడల్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. ఇండోనేషియా వేదికగా ఆసియా క్రీడలు జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే రెజ్లింగ్ 65 కేజీల పురుషుల విబాగంలో భజరంగ్ పునియా సత్తాచాటి భారత్కు పసిడి పతకం అందించాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ కు తొలిరోజు శుభారంభం లభించింది.
ఫైనల్లో జపాన్కు చెందిన తకాటానిపై 11-8 తేడాతో పునియా ఘనవిజయం సాధించాడు. కాగా.. అంతకు ముందు జరిగిన సెమీస్ లో మంగోలియాకు చెందిన బచులున్ పై పునియా 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. క్వార్టర్స్లో పునియా తజకిస్థాన్కు చెందిన ఫైజీవ్ అబ్దుల్ ఖాసిమ్పై 12-2 తేడాతో విజయం సాధించాడు. పురుషుల రెజ్లింగ్లో పునియా ఒక్కడే రాణించగా.. పవన్ కుమార్, ఖత్రీ మౌసమ్ నిరాశ పరిచారు.
- Advertisement -