ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం – భూగర్భ జలాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ప్రపంచ నీటి దినోత్సవం మనం నీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్న దినం.. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
నీటిని పొదుపుగా వాడుకుందాం వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దాం అన్నారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఈ ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి.. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్న అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి.. నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలి అన్నారు.
Also Read:నియోజకర్గాల పునర్విభజనపై స్టాలిన్ సమావేశం