పురాతాన భవనాలను అభివృద్ధి చేస్తాం: సీఎం కేసీఆర్

370
kcr assembly
- Advertisement -

కొన్ని నిబంధనల వల్ల పురాతన భవనాలను కూల్చివేయడం సాధ్యం కాదని తెలిపారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు.

ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక వారసత్వ భవనం…. ఈ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పుడున్న స్థలంలోనే కొత్త ఆస్పత్రి నిర్మించాలని కొందరు కోరానని కానీ అది సాధ్యం కాదని చెప్పారు. ప్రతి భవనాన్ని చారిత్రక భవనం అంటూ కొందరు వితండవాదం చేస్తున్నారని చెప్పారు. హెరిటేజ్ భవనాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మెడికల్ కాలేజీల్లో సీట్లు కాపాడుకోవడానికి వైద్యులకు పదవీవిరమణ వయోపరిమితి పెంపు అవసరం అని చెప్పారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపునకు దేశవ్యాప్తంగా ఉన్న విధానాన్నే అనుసరిస్తున్నామని…. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బిల్లును మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. బిల్లుపై చర్చ జరిగిన అనంతరం ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

- Advertisement -