చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 19

255
What Happened Today
- Advertisement -

డిసెంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 353వ రోజు (లీపు సంవత్సరములో 354వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 12 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి.
1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు. డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.
1985: భారత లోక్‌సభ స్పీకర్‌గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
2009: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.

*జననాలు*

1903: కె.వి. గోపాలస్వామి, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్. (మ.1983)
1918: భాస్కరభట్ల కృష్ణారావు, రచయిత. (మ.1966])
1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత.
1929: నిర్మలా దేశ్ పాండే, ప్రముఖ గాంధేయవాది. (మ.2008)
1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి.
1977: హేమ. ఎమ్, రంగస్థల నటి.

*మరణాలు*

1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893)
2015: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?గోవా విముక్తి దినోత్సవం.

- Advertisement -