గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్‌..

157
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జి శ్రీనివాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా విసిరినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు వరంగల్ రూరల్ అడిషనల్ కలెక్టర్‌ మహేందర్.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి సంవత్సరం పాల్గొని పలువురిని భాగస్వామ్యం చేస్తానని , ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించవచ్చు , మొక్కలు నాటడం సకాలంలో వర్షాలు పడుతాయని ,పర్యావరణ పరిరక్షణ కు ఎంతో దోహదపడుతుందన్నారు.

ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని మూడు మొక్కలు నాటి మూడు సంత్సరాలు కాపాడే బాధ్యత తీసుకోవాలని కోరారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మరో ముగ్గురికి శ్రీ వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్ మహబూబాబాద్ , మహేందర్ ఆర్డీవో వరంగల్ రూరల్ , ఎల్ కిషన్ ఆర్డీవో పరకాలకి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

- Advertisement -