ఆ కథ కోసం చిరు, బాలయ్య పోటీ.!

205
War between Chiru and Balayya About Uyyalawada
- Advertisement -

12 సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ రెడీ అయ్యారు. బాలయ్య మూవీ జనవరి 12 రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. తాజాగా ఖైదీని 11న విడుదల చేస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఇద్దరు ఆగ్రకథానాయకులకు ఇవి మైలు రాయి చిత్రాలు కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది .అయితే ఈ పోటీ ఇంకా మొదలవ్వకముందే ఇంకోక పోటీ కూడా వీరి మధ్యలో జరుగుతుంది.అది కూడా ఒక కథ గురించి.అవును ఆ మధ్య చిరు రీ ఎంట్రీ కోసం పరచూరి బ్రదర్స్ ఒక కథను సిద్ధం చేశారు ఇప్పుడు ఆ కథ కోసం వీరిద్దరూ నువ్వా-నేనా అంటూ పోటీ కు దిగారు.

అది మరేంటో కాదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. తొలుత ఈ కథలో చిరంజీవి నటిస్తాడని వార్తలు వినిపించినా.. హిస్టారికల్ మూవీ కావడంతో రిస్క్ చేయకుండా చిరంజీవి కత్తిరీమేక్ వైపు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఈకథ పై బాలకృష్ణ ఆశక్తి కనపరస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1857లో తొలి స్వతంత్ర సమరం జరిగితే 1847లోనే స్వతంత్ర భారతం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు ఉయ్యాలవాడ.ఎంతో ఉద్వేగ భరితంగా ఉండే కథను చేస్తే బాగుంటుందని బాలయ్య పరచూరి బ్రదర్స్ తో మాట్లాడాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ కథపై మళ్లీ చిరు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇదే కథతో నెక్స్ట్ సినిమా చేయాలని చిరు భావిస్తున్నాడట. దీంతో ముందుగా ఏ హీరో ఇంట్రెస్టింగ్ చూపించని ఈ కథ కోసం ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు పోటీ పడడం ఆసక్తికరంగా మారింది.అయితే మరి ఈ సినిమా లో ఎవరు నటిస్తారో చూడాలి.

- Advertisement -