మొన్న వీరసింహా రెడ్డి , ఇప్పుడు వీరయ్య

204
- Advertisement -

వచ్చే సంక్రాంతి కి ఇటు చిరు అటు బాలయ్య సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో మినీ సైజ్ వార్ జరుగుతుంది. తమ హీరో కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మరో హీరోకి నిర్మాతలు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారని నిర్మాతలను తిట్టుకుంటున్నారు.

తాజాగా వీరసింహా రెడ్డి కి సంబందించి సాంగ్ లాంచ్ ను ఓ థియేటర్ లో ప్లాన్ చేసి సక్సెస్ చేశారు. ఆ సాంగ్ లాంచ్ చూసిన మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య సాంగ్ ని నేరుగా యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తూ వీర సింహా రెడ్డి సాంగ్ ను థియేటర్స్ లో లాంచ్ చేయడం ఏమిటని నిర్మాతలను ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ ని ఈ నెల30న థియేటర్స్ లో ప్లాన్ చేస్తున్నారు మైత్రి మేకర్స్.

నిజానికి రెండు సినిమాలు ఒకే బేనర్ నుండి వస్తున్న సినిమాలు కావడంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ నుండి మైత్రి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదేమైనా రెండు సినిమాలకు సంబందించి మైత్రి టీం సమానంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ ఉండవచ్చు కానీ ఈ లోపే ఫ్యాన్స్ రెచ్చిపోతూ తమ సినిమాకి ఇంపార్టెన్స్ తగ్గిందని భావిస్తున్నారు. రెండ్రోజుల కిందట వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ వీర సింహా రెడ్డి కి కూడా ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -