ఓటర్ల జాబితా పిటిషన్‌..కొనసాగుతున్న సస్పెన్స్

193
high court
- Advertisement -

తెలంగాణ తుది ఓటర్ల జాబితాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా అఫిడవిట్ దాఖలు చేసింది ఎన్నికల సంఘం. ఓటర్ల నమోదు,సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని దీనికి గడువు నిర్దేశించలేమని చెప్పింది. ఇప్పటివరకు 34 లక్షల ఓటర్లను పరిశీలించి పరిష్కరించామని తెలిపింది.

ఈ నెల 12న తుది జాబితా పాటు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలిపింది… జాబితాలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు వివియోగించుకునే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే తాము మరిన్ని వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు శశిధర్ రెడ్డి తరపు న్యాయవాది. దీంతో విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది న్యాయస్ధానం.

- Advertisement -