బీజేపీ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద..!

193
Swamy Paripoornananda to Join BJP..!
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూకుడుపెంచాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ క్షేత్రస్ధాయిలో రంగంలోకి దిగగా ప్రతిపక్ష పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి.

బీజేపీ,కాంగ్రెస్,టీజేఎస్ భారీ బహిరంగసభల ద్వారా ప్రజల ముందుకురానున్నాయి. ఈ 27న బీజేపీ కరీంనగర్‌లో భారీ బహిరంగసభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త పొలిటికల్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఇవాళ భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి త్వరలో లడ్డూ వంటి వార్త వస్తుందంటూ మహేశ్వరంలో పరిపూర్ణానంద ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా బరిలోకి దించేందుకు కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. లేదంటే ఎంపీగానైనా ఈ ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. తన రాజకీయ ప్రవేశంపై పరిపూర్ణానంద గతంలోనే ప్రకటన చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ప్రకటించారు.

- Advertisement -