ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో తగిలిన హ్యామ్స్ట్రింగ్ (తొడ వెనుక భాగం) గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి ఈ స్టార్ ఆటగాడు జట్టులోకి తిరిగి వస్తాడనే ఆశలు చిగురించాయి.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లోకి పునరాగమనం చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.ఎందుకంటే అతను ఇంగ్లాండ్ సిరీస్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో తగిలిన హ్యామ్స్ట్రింగ్ గాయం నుండి కోహ్లీ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ గాయం వల్లే అతను ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరం కావాల్సి వచ్చింది.
Also Read:రామాలయం విరాళాల వివాదంపై సిట్
హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటున్న తీరును మరింత క్షుణ్ణంగా అంచనా వేయడానికి కోహ్లీ జూన్ 22న బీసీసీఐ (BCCI), సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు రిపోర్ట్ చేయనున్నట్లు నివేదించింది. జూలై 14 నుండి 19 వరకు జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు ముందు కోహ్లీ ఫిట్నెస్ను CoE బృందం పరిశీలించనుంది.
కోహ్లీ తన హ్యామ్స్ట్రింగ్ సమస్య నుండి వేగంగా కోలుకుంటున్నాడు, ఇది అతను జట్టులోకి తిరిగి రావడానికి మరింత సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో కుడి హ్యామ్స్ట్రింగ్కు తగిలిన గాయం తర్వాత విరాట్ కోహ్లీ కోలుకునే ప్రక్రియ బాగా సాగుతోంది. లండన్లోని CoE బృందం అతనిని పరీక్షించి, పునరావాస (Rehab) ప్రారంభ దశలో కొనసాగించాల్సిన ప్రోగ్రామ్ను అతనికి అప్పగించింది అని ఒక విశ్వసనీయ వర్గం తెలిపినట్లు వెబ్సైట్ పేర్కొంది. మళ్లీ పరీక్షలు, తదుపరి ప్రణాళిక మరియు ఫిట్నెస్ క్లియరెన్స్ కోసం అతను జూన్ 22, 2026న CoE కు రిపోర్ట్ చేస్తాడు అని ఆ వర్గం జోడించింది.
భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల కోహ్లీ గురించి మాట్లాడుతూ… ఇంగ్లాండ్ వన్డేలకు అతను తిరిగి వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ వన్డేల కోసం కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసిన సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. “విరాట్ విషయానికి వస్తే, ఐపీఎల్ ఫైనల్స్లో అతను గాయపడి ఇప్పటికి వారం కూడా కాలేదు. అతను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితమైన టైమ్లైన్ మాకు ఇంకా తెలియదు. కానీ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి అతను ఫిట్గా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఖచ్చితమైన సమాధానం కాదు కాబట్టి దీనిని ఇప్పుడే ఖరారు చేయలేము. ఫిజియో నుండి నాకు ఇంకా స్పష్టమైన రిపోర్ట్ రాలేదు” అని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ చెప్పారు.

