- Advertisement -
తన పుట్టినరోజు సందర్భంగా వేములవాడ రాజన్నను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయని…కరోనా కట్టడి కి ప్రధాని మోదీ, సిఎం కెసిఆర్ లు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి స్వీయ రక్షణ తోనే మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపారు. యావత్ ప్రజలను కరోనా నుండి కాపాడాలని స్వామివారిని వేడుకున్నానని…. ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -