ఈటల భూవివాదంపై విచారణ షురూ..

124
minister etela
- Advertisement -

మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జాపై విచారణ మొదలైంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేశాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలు జారీ చేయగా రంగంలోకి దిగారు ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు.

ఒకవైపు బాధితుల నుంచి సమాచారం తీసుకుంటూనే, మరోవైపు క్షేత్ర స్థాయిలో డిజిటల్ సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఏడుగురు ఫిర్యాదు చేసినప్పటికీ.. మరింత మంది బాధితులు నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అచ్చంపేట గ్రామ పరిధిలో భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. వరంగల్ అర్బన్ జిల్లా మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ సహా హుజూరాబాద్ నియోజక వర్గంలో అడుగడుగునా భారీగా పోలీసులను మోహరించారు.

- Advertisement -