సీఎం కేసీఆర్ పుస్తక ప్రియుడుః ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌

241
venakiah naidu
- Advertisement -

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు తెలుగు భాష మీద మంచి ప‌ట్టు ఉంద‌ని..ఆయ‌న ఒక క‌వి, ర‌చ‌యిత అన్నారు ఉప‌రాష్ట్ర వెంక‌య్య‌నాయుడు. హైదరాబాద్ లోని ఎన్టీ ఆర్ గ్రౌండ్స్ లో నేషనల్ బుక్ ఫెయిర్ ను ఆయన ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ.. కేసీఆర్ కు పుస్త‌కాలంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు.

cm kcr

కేసీఆర్ గ్రంథాలయ ఉద్యమానికి మరింత ప్రాధాన్యత ఇస్తారని తాను ఆశిస్తున్నానని అన్నారు. సాహితీ ప్రియుడు అని, పుస్తకాలను, సాహిత్యాన్ని ఆస్వాదించడం మొదలైతే, అది ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేమని అన్నారు. హైదరాబాద్ బిర్యానీ తింటే నోరు ఊరొచ్చేమో కానీ, మంచి పుస్తకాన్ని చదివితే ఆనందంగా ఉంటుంద‌న్నారు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌.

- Advertisement -