జనవరి 26 నుంచి నరేంద్రమోడీకి నరకం..

301
modi
- Advertisement -

పెద్ద నోట్లు రద్దయి 17 రోజులు గడుస్తున్న సామాన్యుడి కష్టాలు తీరడం లేదు. పాత నోట్ల మార్పిడి బంద్ నేటి నుండి అమల్లోకి రానుంది. చిల్లర దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల ముందు,ఏటీఎం ముందు క్యూలైన్లో నిలబడుతున్నారు. మరోవైపు క్యూ లైన్లలో నిలబడి చినిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతునే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 2017 జనవరి 26 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నరకం తప్పదని ప్రముఖ రాజకీయ నాయకులకు, సినిమా ప్రముఖులకు జ్యోతిష్యం చెప్పే అస్ట్రో గురు వేణు స్వామి తెలిపారు. మోడీ జాతక రిత్య రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం వెనక్కి రాదని… సామాన్యులు ఇబ్బందులు పడతారని తెలిపారు.

మోడీ జాతకరిత్య పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. జనవరి 26 నుంచి మోడీకి సమస్యల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించారు. మోడీ నిర్ణయాల వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉందని…ఆరెస్సెస్,వీహెచ్‌పీ సైతం మోడీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందన్నారు.

మోడీ నిర్ణయాలతో సొంతపార్టీ బీజేపీలో సైతం అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలిపారు. మోడీకి ఒక్కడికే పేరు రావటం జీర్ణించుకోలేని కొంతమంది…ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని తెలిపారు.పాలపొంగుపై నీళ్లు చల్లినట్లుగా….మోడీ చరిష్మా అమాంతం పడిపోతుందని….ప్రజలకు మోడీ శత్రువగా మారే అవకాశం ఉందన్నారు.

- Advertisement -