సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రి …

153
prashanth reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా యాదాద్రి పనుల పురోగతి పై ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రధాన ఆలయం,పుష్కరిణి, కల్యాణకట్ట,ప్రెసిడెన్షియల్ సూట్,విల్లాలు రింగ్ రోడ్డు పనుల పురోగతి గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ…”గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదాద్రిని ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు.ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరగాలి.ప్రెసిడెన్షియల్ సూట్,వివిఐపి 13 విల్లాలు ఈ నెల లోపు పూర్తి చేయాలి.భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి,కళ్యాణకట్ట పనులు ఈనెలలోపు పూర్తి చేయాలన్నారు.

143 కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.యాదాద్రి పనుల రోజువారీ వర్క్ చార్ట్ తయారు చేసుకోవాలి.ప్రతివారం పనుల పురోగతి పై ఈఎన్సీ సమీక్ష నిర్వహించాలి.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యాదాద్రి పరిసర ప్రాంతాలు అంత పచ్చదనంతో పరిఢవిల్లేలా చూడాలి.పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండాలి” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

యాదాద్రి రింగ్ రోడ్డు పనుల కోసం భూసేకరణ ఈ జనవరి నెలలోపు పూర్తి చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ను ఫోన్లో మంత్రి ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి,ఈ.ఈ వసంత నాయక్,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ,పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -